వచనము
అ మ్మహోగ్రగ్రాహంబు పార్థబాణపంచక విభిన్నదేహం బయి పంచత్వంబుఁ బొందినం జూచి ద్రోణుం డర్జును ధనుః కౌశలంబునకుఁ దనయం దతిస్నేహంబునకు మెచ్చి వీనిచే ద్రుపదుండు బంధుసహితంబు పరాజితుం డగు నని తన మనంబున సంతోషించి వానికి ననేక దివ్యబాణంబు లిచ్చె నని యర్జునుకొండుకనాఁటి పరాక్రమగుణసంపదలు వైశంపాయనుండు జనమేజయునకుం జెప్పె నని.
(అర్జునుడి చేతిలో ద్రుపదుడు ఓడిపోగలడని ద్రోణుడు సంతోషించాడు. అర్జునుడికి చాలా దివ్యబాణాలు ఇచ్చాడు - అని అర్జునుడి చిన్ననాటి పరాక్రమం గురించి వైశంపాయనుడు జనమేజయుడికి చెప్పాడు.)
No comments:
Post a Comment