వచనము
అని పుత్త్రముఖావలోకన లోలత్వంబున దీన వదనుండై దేవిం బ్రార్థించినఁ గుంతియుం బుత్రోత్పాదనోన్ముఖియై కుంతిభోజునింటఁ దన కొండుకనాఁడు దుర్వాసునిచేతం బడసిన మంత్రంబు తెఱంగు పతి కెఱింగించి యమ్మంత్రంబున కిది యవసరం బయ్యె నేవేల్పు నారాధింతు నానతి మ్మనిన సంతసిల్లి కుంతీదేవికిం బాండురా జి ట్లనియె.
(అని కుంతిని ప్రార్థించగా ఆమె దుర్వాసుడి ద్వారా తనకు లభించిన మంత్రం గురించి పాండురాజుకు చెప్పి ఏ దేవుడిని సేవించాలో ఆజ్ఞాపించమని భర్తను అడిగింది. పాండురాజు సంతోషించి.)
No comments:
Post a Comment