వచనము
అంత భీమదుర్యోధనుల గదా కౌశలంబు సూచుజనుల పక్షపాత జనిత పరస్పర క్రోధ వచనంబులు విని ద్రోణుండు రంగ భంగ భయంబున నశ్వత్థామం బంచి వారి నిద్దఱ వారించి వారాశియుం బోలె బోరన మ్రోయుచున్న వాదిత్రశబ్దంబు లుడిపి నా ప్రియశిష్యుండయిన యర్జును ధనుర్విద్యా కౌశలంబుఁ జూడుం డనిన నయ్యాచార్యు వచనానంతరంబున.
(ఈ యుద్ధాన్ని చూస్తున్న ప్రజలు కోపావేశాలు పెంచుకొని ఒకరినొకరు అంటున్న మాటలు విని ద్రోణుడు అశ్వత్ధామను పంపి భీమదుర్యోధనులను వారించాడు. నా ప్రియశిష్యుడైన అర్జునుడి నైపుణ్యం చూడండి - అని ద్రోణుడు ప్రకటించిన తరువాత.)
No comments:
Post a Comment