వచనము
అనిన విని దుర్యోధనున కెంతయు సంతోషంబుగాఁ గర్ణుం డతనితోడి యిష్ట సఖిత్వంబున కొడంబడియె నంతఁ గొడుకు రాజ్యాభిషేకోత్సవంబు సూచి హర్షపరవశుం డయి సూతుండు రథంబు డిగ్గి కర్ణునొద్దకుం బఱతెంచినఁ గర్ణుండును బితృగౌరవంబున సంభ్రమించి వానికి వినయవినమితోత్తమాంగుం డయిన.
(కుమారుడి అంగరాజ్యాభిషేకం చూసి అధిరథుడు రథం దిగి కర్ణుడి దగ్గరకు వచ్చాడు. కర్ణుడు తండ్రికి నమస్కరించాడు.)
No comments:
Post a Comment