వచనము
ఈరాజ్యంబు మొదలింటంగోలె భవదీయం బయినది ప్రకృతిజనులు వశ్యులు గాకున్నను గ్రమాగతంబయి మాకు నప్రయత్నలభ్యంబగుఁ దొల్లి పాండురాజు రా జై గుణంబులం బ్రజానురాగంబు వడయుటం జేసి యెల్ల వారును ధర్మరాజురాజ్యంబ వలతురు దాని నెఱింగియ కాదె యేను నిత్యదాన సమ్మానంబులం బ్రకృతిజనంబులకు సంతోషంబు సేయుచునుండుదు నిందుల దుష్టజనులపక్షపాతవచనంబు లుడుగునంతకు నుపాయంబునఁ గొంతినిఁ బాండవులను దదీయభృత్యామాత్యవర్గంబుతో వారణావతంబునకుం బుత్తము మనకు రాజ్యంబు సుప్రతిష్ఠితం బైన మఱి వార లిందులకు వత్తు రనిన దుర్యోధనునకు ధృతరాష్ట్రుం డిట్లనియె.
(ఇక్కడి చెడ్డవాళ్ల పక్షపాతపు మాటలు ఆగిపోయేవరకూ పాండవులను వారణావతం పంపుదాము. మన రాజ్యాధికారం స్థిరపడిన తరువాత వాళ్లు ఇక్కడికి వస్తారు - అని దుర్యోధనుడు అనగా ధృతరాష్ట్రుడు ఇలా అన్నాడు.)
No comments:
Post a Comment