వచనము
పాండుకుమారులు ననేకభూసురాశీర్వాదనాదాభినందితు లై ఫాల్గునమాసంబున శుక్లపక్షమున నష్టమియు రోహిణినాడు వారణావతంబు సొచ్చి సర్వాలంకారసుందరం బయిన రాజమందిరంబున నున్న కొన్ని దినంబులకుం బురోచనుండు దనచేసిన చతుశ్శాల సకలజననయనాభిరామం బైన దానిం జూపినం జూచి పాండుసుతులు సంతసిల్లి పురోచనశిల్పాచార్యులం బూజించి పుణ్యాహరవపురస్సరంబుగా గృహప్రవేశంబు సేసి రంతం బరాభిప్రాయమాయోపాయప్రయోగవిదుం డైన ధర్మతనయుండు దానికృత్రిమరమణీయత నుపలక్షించి యల్లన భీమున కి ట్లనియె.
(పురోచనుడు పాండవులకు తాను నిర్మించిన చతుశ్శాలను చూపించాడు. అది చూసి ధర్మరాజు భీముడితో ఇలా అన్నాడు.)
No comments:
Post a Comment