సీసము
కాలమేఘంబునుబోలె విశాల మై
నీల మై దేహంబు గ్రాలుచుండ
ఘనతటిల్లతలయ ట్లెనిమిది దంష్ట్రలు
మెఱవంగఁ బండులుఁ గొఱికి పెలుచ
నతిరోషలోహితాయతవృత్తనేత్రముల్
దిరుగంగఁ బెట్టుచుఁ బరుషకేశ
జాలంబు గాడ్పునఁ దూలంగఁ గాలోప
మానుఁ డై చనుదెంచి మానుషాదుఁ
ఆటవెలది
డనుజఁ జూచి కష్టమనుజులఁ గూడి నా
పనుపు సేయకుండఁ జనునె నీకు
ననుచు నుదరిపలుక విని హిడింబయుఁ గడు
వెఱచి భీమసేను మఱువు సొచ్చె.
(హిడింబుడు అక్కడికి వచ్చి - నీచులైన మానవులతో కలిసి నా ఆజ్ఞ తోసిపుచ్చటం తగిన పనేనా? - అని గద్దించి పలుకగా హిడింబ భయపడి భీముడి చాటుకు వెళ్లింది.)
No comments:
Post a Comment