వచనము
నన్నును మిమ్మును రక్షించి యా రక్కసు నుక్కడంగ నశ్రమంబున నిప్పుడు చంపుం జూడుం డనిన నందఱు లేచి యుద్ధతులై మల్లయుద్ధంబు సేయుచున్న భీమహిడింబులంజూచి రంత నచ్చోటికిం జని యర్జునుండు భీమసేనున కి ట్లనియె.
(ఆ రాక్షసుడిని చంపి నన్నూ మిమ్మల్నీ రక్షించగలడు - అనగా అందరూ లేచి అక్కడికి వెళ్లారు. అప్పుడు అర్జునుడు వాళ్లు యుద్ధం చేసే చోటికి వెళ్లి భీముడితో ఇలా అన్నాడు.)
No comments:
Post a Comment