వచనము
అట్టి చిత్ర వధం జూచి చిత్రీయమాణచిత్తు లై భీమసేను పరాక్రమంబు వొగడుచు నందఱు హిడింబానుగమ్యమాను లై చని ర ట్లరుగునెడ భీముండు హిడింబ రాక కొడంబడక రాక్షసులు వైరంబుఁ దలంచి మాయలు సేయుదురు కావున నీవు మాతోడ రావలవదు నిన్ను విశ్వసింపము నీవును మీయన్నవోయిన తెరువున పొ మ్మనిన నది భయంపడి వడవడ వడంకుచున్న దానిం జూచి కరుణారసార్ద్రచిత్తుండయి ధర్మరాజు భీమున కి ట్లనియె.
(అందరూ భీముడి దగ్గరకు వెళ్లారు. భీముడు హిడింబతో - రాక్షసులు మాయలు చేస్తారు. నువ్వు మాతో రావద్దు. మీ అన్న చచ్చినట్లే చావు - అనగా ఆమె భయపడటం చూసి ధర్మరాజు దయతో ఇలా అన్నాడు.)
No comments:
Post a Comment