వచనము
అని భీమసేను నొడంబఱచి హిడింబ కనురాగంబుగాఁ జెప్పి నీవు శుచి వయి యుత్తమ స్త్రీ గుణంబులు దాల్చి భీమునకు మనఃప్రియంబు సేయుము పగళ్లెల్లను మీ యిష్టంబున విహరించి రాత్రులు మాయొద్దన యుండు నది యని నియమించిన భీముండును బుత్త్రజన్మం బగునంతకు దీని మీవచనంబునఁ బరిగ్రహించెద నని వారల సమక్షంబున సమయంబు సేసె నంతఁ బాండవులు జననీసహితంబు శాలిహోత్రునాశ్రమంబునకుం జని ప్రభాతసమయంబున నక్కొలనఁ గృతస్నాను లయి సంధ్యావందనంబులు దీర్చి శాలిహోత్రుచేతం బూజితు లయి తద్వనస్పతి చ్ఛాయా శీతల తలంబున విశ్రమించి విగత క్షుత్పిపాసు లై సుఖం బున్నంత.
(భీముడు అందుకు అంగీకరించాడు. తరువాత పాండవులు తల్లితో శాలిహోత్రుడి ఆశ్రమానికి వెళ్లారు.)
No comments:
Post a Comment