వచనము
దీని నెఱింగి మీకు హితోపదేశంబు సేయ వచ్చితి నిఖిల ధర్మవిదుల రయిన వినీతుల రయిన మీకు బాంధవవియోజనం బయిన యీ కర్మంబు పురాకృతంబు దీనికి శోకింపవలవదు కొండొకకాలంబునకు మీరును బాంధవులం గలసి యెప్పటియట్ల రాజ్యంబు సేయుదు రిది శాలిహోత్రుతపఃప్రభావంబున నైన కొలను దీని జలంబు లుపయోగించినవారికి బుభుక్షాపిపాసలు లే వివ్వనస్పతియును శీతవాతాతపవర్షంబులవలన రక్షించు నిం దొరు లెఱుంగకుండఁ గార్యార్థుల రై కతిపయదినంబు లుండి యేకచక్రపురంబున కేఁగి యందు బ్రాహ్మణభావంబున బ్రాహ్మణగోష్ఠి నుండి నారాక ప్రతీక్షించియుండు నది యని కఱపి తనకు వినయావనతులయి కృతాంజలు లయిన మనుమల దీవించి కౌఁగిలించుకొని బాష్పపూరితనయన యయి మ్రొక్కియున్న కోడలి నూరార్చి నీకొడుకు ధర్మనిత్యుం డీ యుధిష్ఠిరుండు నారాయణభుజంబులంబోని తననలువురుదమ్ములబలంబున సర్వపార్థివుల శాసించి సార్వభౌముం డై రాజసూయాశ్వమేధాదిక్రతువులు సేసి పితృపైతామహం బైన రాజ్యలక్ష్మి ననుభవించుచుం గురుకులంబునెల్లఁ బవిత్రంబు సేయు నని శోకోపశమనంబుఁ జేసి హిడింబం జూచి దీనిపేరు కమలపాలిక యిది భీమునకు వశవర్తిని యయి పరిచరించి మహాసత్త్వుం డయిన కొడుకుం గాంచు నాతండు మిమ్మందఱ నాపద్విషయంబున నుద్ధరించు నని చెప్పి మునివరుండు తిరోహితుం డైన.
(కొంతకాలానికి మీరు కూడా బంధువులతో కలిసి రాజ్యం చేస్తారు. మీరు ఇక్కడ కొంతకాలం ఉండి తరువాత ఏకచక్రపురంలో బ్రాహ్మణరూపంలో ఉంటూ నా రాక కోసం ఎదురుచూడండి - అని చెప్పాడు. హిడింబను చూసి - ఈమె మహాబలవంతుడైన కొడుకును కంటుంది. అతడు ఆపత్సమయంలో మిమ్మల్నందరినీ రక్షిస్తాడు - అని చెప్పి వెళ్లాడు.)
No comments:
Post a Comment