వచనము
ఇట్లు సద్యోగర్భంబునం గామరూపధరుం డై ఘటోత్కచుండు పుట్టి తత్క్షణంబ నవయౌవనుండును ననేకాస్త్రశస్త్ర కుశలుండును నపరిమిత రాక్షస పిశాచ బలపరివృతుండును నై తల్లిదండ్రులకు గుంతీదేవికి మ్రొక్కిన నగ్రనందనుం డగుట నందఱును గరంబు గారవంబునఁ గొనియాడం గొన్నిదినంబు లుండి యొక్కనాఁ డంజలిపుటఘటితమస్తకుం డయి రాక్షసపిశాచబలంబులతోడ నాయిమ్ముల నుండెదం బని గలయప్పుడు నన్నుఁ దలంచునది యాక్షణంబ వత్తునని యందఱిచేత ననుజ్ఞాతుం డై తల్లిం దోడ్కొని యుత్తరాభిముఖుం డయి యరిగె నిట పాండవులును శాలిహోత్రునొద్ద ననేకధర్మశాస్త్రనీతిశాస్త్రంబు లభ్యసించి యమ్మునివరు వీడ్కొని చని విదర్భమత్స్యత్రిగర్తకీచకవిషయంబులు గడచి యేకచక్రం బను నగ్రహారంబు గని.
(నవయౌవనంతో పుట్టిన ఘటోత్కచుడు - నన్ను తలచుకోగానే వస్తాను - అని చెప్పి తల్లితో ఉత్తర దిశగా వెళ్లాడు. పాండవులు తరువాత శాలిహోత్రుడి దగ్గర సెలవు తీసుకొని చాలా దేశాలు దాటి ఏకచక్రమనే అగ్రహారం చేరారు.)
No comments:
Post a Comment