తరలము
పలుదెఱంగుల పిండివంటలుఁ బప్పుఁగూడును నేతికుం
డలు గుడంబు దధిప్రపూర్ణఘటంబులుం గొనివచ్చి యీ
నలఘుసత్త్వుఁడు మారుతాత్మజుఁ డన్నిటన్ గతఖేదుఁ డై
బలము గల్గి కడంగె నప్పుడు బ్రాహ్మణార్థము సేయఁగన్.
(భీముడికి పిండివంటలు, పప్పు, కూడు, నేతికుండలు, బెల్లం, పెరుగు నిండిన కుండలు తెచ్చిపెట్టారు. భీముడు అవి తిని బకాసురుడి మీదికి వెళ్లటానికి పూనుకొన్నాడు.)
No comments:
Post a Comment