వచనము
అంత నారాక్షసులు భీతు లై భీము సేసిన సమయంబున కొడంబడి నాఁటంగోలె నేకచక్రనివాసులకు నుపద్రవంబుఁ చేయనోడి రట్లు భీముండు బకాసురుం జంపి వానిం జంపుట జగద్విదితంబుగాఁ దత్కళేబరం బీడ్చుకొని వచ్చి నగర ద్వార సమీపంబున వైచి యందుల విప్రులకు సంతోషంబు సేసి నిజనివాసంబునకుం జని త ద్వృత్తాంతం బంతయుఁ దల్లికి సహోదరులకుం జెప్పి యున్నంత.
(ఆ రాక్షసులు అందుకు అంగీకరించారు. భీముడు బకుడి కళేబరాన్ని ఏకచక్రనగరద్వారం దగ్గర పడవేసి, ఇంటికి వెళ్లి తల్లికి, అన్నదమ్ములకు జరిగినది చెప్పాడు. అప్పుడు.)
No comments:
Post a Comment