గద్యము
ఇది సకలసుకవిజనవినుత నన్నయభట్టప్రణీతం బైన శ్రీమహాభారతంబునం దాదిపర్వంబునం గుమారాస్త్రవిద్యా సందర్శనంబును ద్రుపదగ్రహణమోక్షణంబును దుర్యోధనుదుర్మంత్రంబును వారణావతయాత్రయు జతుగృహదాహంబును విదురోపదిష్టద్వారంబునం బాండవాపక్రమణంబును హిడింబువధయు హిడింబావివాహంబును వ్యాససందర్శనంబును ఘటోత్కచసంభవంబును విప్రగృహంబున నజ్ఞాతచర్యయును బకాసురవధయును నన్నది షష్ఠాశ్వాసము.
(ఇది నన్నయభట్టు రచించిన మహాభారతంలో ఆదిపర్వంలో - కురుకుమారుల అస్త్రవిద్యాసందర్శనం, ద్రుపదుడిని యుద్ధంలో బంధించి విడిచిపెట్టటం, దుర్యోధనుడి దురాలోచన, పాండవుల వారణావత యాత్ర, లాక్షాగృహదహనం, విదురుడు చెప్పిన విధంగా పాండవులు బయటపడటం, హిడింబాసురుడిని సంహరించటం, భీమసేనుడు హిడింబను వివాహమాడటం, వ్యాసమహర్షిదర్శనం, ఘటోత్కచుడు జన్మించటం, పాండవులు బ్రాహ్మణుడి ఇంట్లో అజ్ఞాతంగా ఉండటం, బకాసురుడిని చంపటం - అనే అంశాలు కలిగినది ఆరవ ఆశ్వాసం.)
No comments:
Post a Comment