వచనము
ఏను ధర్మపథంబున నున్నవాఁడ నేల తొలంగుదు ననిన నలిగి కల్మాషపాదుండు దనచేతి కశకోల నమ్మునీంద్రుని వ్రేసిన నవమానితుం డయి కోపారుణిత నయనంబుల నతనిం జూచి నీవు రాక్షసభావంబున నకారణంబ నాకు నికారంబు సేసితి కావున రాక్షసుండ వయి మనుష్యపిశితం బశనంబుగా నుండు మని శాపం బిచ్చినఁ గల్మాషపాదుం డమ్మహామునివరు వసిష్ఠతనయుంగా నెఱింగి నాకు శాపవ్యపాయంబు ప్రసాదింప వలయు నని ప్రార్థించుచున్న నచ్చోటికి విశ్వామిత్రుండు వచ్చి వారలు దన్నెఱుంగకుండ నంతర్హితుం డయి కల్మాషపాదు నంతర్గతుం డయి యుండ నొక్కరక్కసుం గింకరుం డను వానిం బంచిన వాఁడు విశ్వామిత్రు నాదేశంబునను శక్తి శాపంబుననుం జేసి కల్మాషపాదునంతరాత్మ నావేశించి యున్నంత.
(ధర్మమార్గంలో ఉన్న నేను ఎందుకు తొలగుతాను - అనగా కల్మాషపాదుడు ఆగ్రహించి శక్తిని తన కొరడాకర్రతో కొట్టాడు. ఆ ముని కళ్లెర్రజేసి - రాక్షసుడివై నరమాంసం తింటూ జీవించు - అని శపించాడు. అప్పుడు కల్మాషపాదుడు శాపవిమోచనం కోసం ప్రార్థిస్తూండగా - విశ్వామిత్రుడు అక్కడికి వచ్చి, వారికి కనపడకుండా ఉండి, కింకరుడనే రాక్షసుడిని కల్మాషపాదుడి మనసులో చేరమని ఆజ్ఞాపించాడు. వాడు అలాగే ప్రవేశించగా.)
No comments:
Post a Comment