సీసము
ఆది భరద్వాజుఁ డను ముని కలశంబు
నం దుద్భవించిన యనఘమూర్తి
ద్రోణుండు మఱి పృషతున కుద్భవించిన
ద్రుపదుండు నొక్కటఁ దొడఁగి యిష్ట
సఖు లయి వేదముల్ సదివి ధనుర్వేద
మగ్నివేశులతోడ నర్థిఁ గఱచి
చని ద్రుపదుండు పాంచాలభూములకు రా
జైన భారద్వాజుఁ డతని కడకు
ఆటవెలది
నరిగి వానిచేత నవమానితుం డయి
హస్తిపురికి వచ్చి యఖిలకురుకు
మారవరుల నెల్ల మానుగా శస్త్రకో
విదులఁ జేసె లోకవిదితయశుఁడు.
(ద్రోణుడు, ద్రుపదుడు ఒకేచోట ఉండి, స్నేహితులై వేదాలు చదివారు. పాంచాలదేశానికి ద్రుపదుడు రాజైన తరువాత ఒకసారి ద్రోణుడిని అవమానించాడు. ద్రోణుడు హస్తినకు వెళ్లి కురుకుమారులకు శస్త్రవిద్యలు నేర్పించాడు.)
No comments:
Post a Comment