వచనము
రణరంగంబున ద్రోణు వధియించునట్టి కొడుకును నర్జునునకు దేవి యగునట్టి కూఁతునుం బడయుదు నని బ్రహ్మవిదు లయిన బ్రాహ్మణులనివాసంబులకుం జని నిత్యంబును బ్రాహ్మణోపాస్తి సేయుచు నొక్కనాఁడు గంగాకూలంబు నందు వానప్రస్థవృత్తి నున్న యాజోపయాజు లనువారి నిద్దఱ ననవరత వ్రత వ్యాసక్తులం గాశ్యపగోత్రులం గని వారికి నమస్కరించి యందుఁ గొండుక యయ్యును దపోమహిమ నెవ్వరికంటెఁ బెద్దయైన వాని నుపయాజు నుపాసించి యి ట్లనియె.
(ద్రోణుడిని చంపగల కొడుకును, అర్జునుడికి భార్యకాగల కూతురిని పొందాలని బ్రాహ్మణసేవ చేస్తూ ఒకనాడు గంగాతీరాన యాజ ఉపయాజులనే ఇద్దరిని చూసి, ఉపయాజిని పూజించి ఇలా అన్నాడు.)
No comments:
Post a Comment