వచనము
దానం జేసి మహీతలంబున కనావృష్టి యయిన నెఱింగి వసిష్ఠుండు శాంతికపౌష్టికవిధు లొనరించి సంవరణుం దోడ్కొని హస్తిపురంబున కరిగిన నఖిలప్రజకు ననురాగం బయ్యె ననావృష్టి దోషంబునుం బాసె నంత సంవరణునకుఁ దపతికిం దాపత్యుం డై వంశకరుండు కురుండు పుట్టె నది మొదలుగా మీరును దాపత్యుల రయితి రని గంధర్వుండు చెప్పిన నర్జునుండు వెండియు ని ట్లనియె.
(అందువల్ల అనావృష్టి ఏర్పడగా వసిష్ఠుడు శాంతిక్రియలు చేసి, సంవరణుడిని తనవెంట హస్తినాపురానికి పిలుచుకువెళ్లాడు. అనావృష్టి తొలగింది. తపతీసంవరణులకు కురుడు పుట్టాడు. అప్పటినుండి మీరు తాపత్యులయ్యారు - అని గంధర్వుడు చెప్పగా అర్జునుడు ఇలా అన్నాడు.)
No comments:
Post a Comment