వచనము
పరాశరుండును బులస్త్యాదిమహామునిప్రార్థితుం డై రాక్షససత్త్రయాగం బుపసంహరించి తన్నియోగంబున నయ్యగ్ని హిమవదుత్తరపార్శ్వంబున వైచిన నదియును బర్వంబుల నందు వృక్షలతా గుల్మ శిలాభక్షణంబు సేయుచుండె నని యిట్లు గంధర్వుండు తాపత్యవసిష్ఠౌర్వోపాఖ్యానంబు చెప్పిన విని యర్జునుండు వాని కి ట్లనియె.
(పరాశరుడు అలాగే సత్రయాగాన్ని ఆపాడు - అని ఆ గంధర్వుడు తాపత్య - వసిష్ఠ - ఔర్వుల కథను చెప్పగా విని అర్జునుడు ఇలా అన్నాడు.)
No comments:
Post a Comment