వచనము
ధౌమ్యుండును వారినతిప్రీతిం బూజించి పురోహితత్వంబుం బరిగ్రహించె నట్లు తేజోరూపబుద్ధివిభవంబుల బృహస్పతిసదృశుం డై వేదవేదాంగవిదుం డైన ధౌమ్యుం బురోహితుంగాఁ బడసి పాండునందను లశేషమహీరాజ్యంబు వడసినంతయ సంతసిల్లి తత్కృతస్వస్త్యయను లయి జననీ సహితంబు దక్షిణ పాంచాలంబున కరుగువారు ముందఱ ద్రుపదపురంబునకుఁ బోయెడు బ్రాహ్మణులం గని మీ రెందులకుం బోయెద రని యడిగిన వా రి ట్లనిరి.
(పాండవులు దక్షిణపాంచాలానికి వెడుతూ ద్రుపదుడి నగరానికి వెళ్లే బ్రాహ్మణులను చూసి - మీరు ఎక్కడికి వెడుతున్నారు - అని అడగగా వారు ఇలా అన్నారు.)
No comments:
Post a Comment