వచనము
అదియును బురంబు పూర్వోత్తరదిగ్భాగంబునం జందనోదకసంసిక్త సమీకృతస్థలం బయి యగాధోన్నతపరిఖాప్రాకారంబులను విశాల ద్వార తోరణంబులను గైలాస శైల విలాసాపహాసి భాసుర గగనతలోల్లేఖిశిఖర రమ్యహర్మ్యతలంబులను బహుప్రకారంబు లైన సారువులనుం జేసి యొప్పుచున్న నందు యథాస్థానంబుల నానాదేశాధిపతుల నుండంబంచి ద్రుపదుండు వారల నెల్లం బూజించెఁ బరమబ్రహ్మణ్యు లగు బ్రాహ్మణులతోడం గలసియున్న పాండవులును బ్రాహ్మణసమూహంబులో నుండి పాంచాలరాజు సమృద్ధినిం జూచి సంతసిల్లి రంత.
(ఆ రాజులకు ద్రుపదుడు విడిది ఏర్పాటు చేశాడు. పాండవులు పాంచాలరాజు ఐశ్వర్యాన్ని చూసి సంతోషించారు.)
No comments:
Post a Comment