వచనము
అని ధృష్టద్యుమ్నుండు మూఁగిన రాజపుత్త్రులకు నెల్ల నెఱుంగం జెప్పి ద్రుపదరాజపుత్త్రిఁ జూచి యఖిలజలధివేలావలయవలయితమహీతలంబునం గల రాజనందను లెల్ల నీస్వయంవరంబునకు వచ్చినవారు వీరలం జూడు మని
దుర్యోధన దుశ్శాసన దుర్ముఖ ప్రముఖు లయిన ధృతరాష్ట్రనందనుల నూర్వురం దత్సమీపంబున నున్న కర్ణాశ్వత్థామ సోమదత్త భూరిశ్రవశ్శ్రుతసేనాదులను బుత్త్రభ్రాతృసమేతు లయి యున్న శల్య విరాట జరాసంధ గాంధారపతులను నక్రూర సారణ సాత్యకి సాంబ సంకర్షణ ప్రద్యుమ్న కృష్ణ కృతవ ర్మానిరుద్ధ యుయుధాన ప్రముఖు లైన యదువృష్ణి భోజాంధకవరులను సుమిత్ర సుకుమార సుశర్మ సుదక్షిణ సుషేణ సేనాబిందు చంద్రసేన సముద్రసే నౌశీనర చేకితాన శిశుపాల శ్రేణీమ జ్జనమేజయ జయద్రథ బృహద్రథ సత్యవ్రత చిత్రాంగద శుభాంగద భగీరథ భగదత్త పౌండ్రకవాసుదేవ వత్సరాజ ప్రభృతు లయిన నానాదేశాధీశులను వేదధ్వని సనాథం బై యొప్పుచున్న బ్రాహ్మణసమూహంబునుం జూపి.
(అని ఆ రాజులకు చెప్పి, ద్రౌపదితో - నీ స్వయంవరానికి వీరంతా వచ్చారు - అని వారిని చూపి.)
No comments:
Post a Comment