చంపకమాల
అవిరళ భస్మ మధ్యమున నగ్నికణంబుల పోలె బ్రాహ్మణ
ప్రవరులలోన నేర్పడక పాండవు లేవురు నున్నఁ జూచి యా
దవ వృషభుండు కృష్ణుఁడు ముదంబున వారి నెఱింగి పార్థుఁ డీ
యువతిఁ బరిగ్రహించు ననియుం దలఁచెన్ హృదయంబులోపలన్.
(బ్రాహ్మణరూపంలో ఉన్న పాండవులను కృష్ణుడు గుర్తించి - అర్జునుడు ద్రౌపదిని చేపడతాడు - అని అనుకొన్నాడు.)
No comments:
Post a Comment