వచనము
ఏమిదోషంబు సేసియు బ్రాహ్మణుండు వధ్యుండు గాఁడు మన రాజ్యంబును నర్థంబును బ్రాహ్మణార్థంబ కావున న వ్విప్రుతోడి దేమి యని ద్రుపదుపయి నెత్తుదెంచిన ద్రుపదుండును కడుభీతుం డై బ్రాహ్మణుల మఱువు సొచ్చె నిట్లు శరణాగతుం డయిన ద్రుపదు నోడకుండు మని బ్రాహ్మణులు దమ తమ దండాజినంబు లెత్తికొని ప్రతిబలంబులపయి వీచుచున్నంత వారలం జూచి నగుచు నర్జునుం డి ట్లనియె.
(అని ద్రుపదుడి పైకి దండెత్తి రాగా అతడు బ్రాహ్మణుల చాటున చేరాడు. వారు తమ జింకచర్మాలను శత్రుసేనల మీద వీచుతుండగా అర్జునుడు నవ్వుతూ ఇలా అన్నాడు.)
No comments:
Post a Comment