సీసము
ఉత్సవ సందర్శనోత్సుకు లై పోయి
కడుఁ బెద్ద ప్రొ ద్దయ్యెఁ గొడుకు లేల
మసలిరొ కౌరవుల్ విసువక వైరంబు
గావించు పాపస్వభావు లెఱిఁగి
క్రందునఁ జంపిరో యందుల కేవురు
లీలతో నొక్కట నేల యరిగి
రవ్యయుం డయిన వేదవ్యాసు వచనంబు
నిక్కంబుగాకుండు నొక్కొ వేల్పు
ఆటవెలది
లార భూసురేశులార మీ శరణంబ
కాని యొండుగతియుఁ గాన నాకు
శరణ మగుఁడు సుతులఁ గరుణతో రక్షింపుఁ
డనుచు గుంతి వగచి వనరుచుండె.
(స్వయంవరానికి వెళ్లిన కొడుకులు ఇంకా తిరిగిరాలేదు. కౌరవులు వారిని గుర్తించి చంపారేమో? వ్యాసుడి మాట నిజం కాకుండా ఉంటుందా? - అని కుంతి విచారిస్తూ ఉండింది.)
No comments:
Post a Comment