వచనము
మఱియు రెండగుపా లన్నలువురకుం బెట్టి తద్భుక్తశేషం బేనును నీవు నుపయోగింత మని పంచినఁ గృష్ణయు నయ్యవ్వ పంచినరూపున నందఱకుం గుడువం బెట్టి తానును గుడిచి దర్భపూరులు విద్రిచి యందఱకు వేఱువేఱ శయనమ్ము లిమ్ముగా రచియించి వానిపయి వారల కృష్ణాజినంబులు పఱచి సుఖశయను లై యున్న వారిపాదంబులకు నుపధానభూత యై శయనించి.
(రెండవభాగం ఈ నలుగురికీ పెట్టి, మిగిలినది నేను, నువ్వు ఉపయోగిద్దాము - అని ఆజ్ఞాపించగా ద్రౌపది అలాగే చేసి, వారు సుఖంగా పడుకొన్న తరువాత వారి పాదాలకు దిండులా తాను పడుకొన్నది.)
No comments:
Post a Comment