వచనము
ఇట్లు వచ్చిన కృష్ణద్వైపాయనునకుఁ గుంతీదేవియుఁ బాండవులును బాంచాలుండు నతిభక్తి మ్రొక్కి యమ్మహామునిం గాంచనమణిమయోచ్చాసనంబున నునిచి యర్ఘ్యపాద్యాదివిధులం బూజించి యున్న వారల కుశలం బడిగి హిత మధుర సత్య సంభాషణామృత రసప్రవాహ సందోహంబున నందఱం బరమానంద హృదయులం జేసియున్న యమ్మునీంద్రునకు ముకుళితకరకమలుం డయి ద్రుపదుం డి ట్లనియె.
(వారు అతడిని పూజించగా, వ్యాసుడు వారి కుశలమడిగాడు. అప్పుడు ద్రుపదుడు ఇలా అన్నాడు.)
No comments:
Post a Comment