వచనము
ఇది దొల్లి నాలాయని యైన యింద్రసేన యనంబరఁగిన పరమ పతివ్రత మౌద్గల్యుం డను మహామునికి భార్య యయి కర్మవశంబున నమ్మునిం గుష్ఠవ్యాధి బాధిత త్వ గస్థిభూత కష్ట శరీరు వయోవృద్ధు వలిపలితధరు దుర్గంధవదను దుఃఖజీవు నతికోపను విశీర్యమాణనఖత్వచుం బరమభక్తి నారాధించి తదుచ్ఛిష్టంబు కుడుచుచున్న నొక్కనాఁడు.
(ఈమె పూర్వం నాలాయని అనే పతివ్రత. మౌద్గల్యుడు అనే మునికి భార్య అయింది. అతడి ముసలివాడు, కుష్ఠరోగి, చర్మపు ముడుతలు, నెరసిన వెండ్రుకలు కలవాడు. మిక్కిలి కోపిష్ఠి. అటువంటి భర్తను ఆమె పూజిస్తూ ఒకనాడు అతను తిని విడిచిన ఎంగిలి అన్నం తింటూ ఉండగా.)
No comments:
Post a Comment