వచనము
అనిన నమరపతి పురోగము లయిన యమరు లెల్ల నమరాగపగాసమీపంబునకుం జనునప్పుడు తత్సలిల మధ్యంబున నొక్క కన్యక యేడ్చుచున్న దాని కన్నీళ్లు కనకకమలంబు లయినం జూచి వేల్పులుం దానును విస్మయం బంది యింద్రుఁ డక్కన్యకయొద్దకుం జని యేడ్చెద వెందుల దాన వని యడిగిన నది యింద్రున కి ట్లనియె.
(అని అనగా దేవతలు వెనుదిరిగి గంగానది దగ్గరకు వెళ్లారు. ఆ నీటిమధ్యలో ఒక కన్య ఏడుస్తూ ఉండగా, ఆమె కన్నీళ్లు బంగారుతామరలు కావటం చూసి దేవతలు ఆశ్చర్యపడ్డారు. ఆ కన్య దగ్గరికి వెళ్లి - ఎందుకు ఏడుస్తున్నావు - అని అడగగా ఆమె ఇంద్రుడితో ఇలా అన్నది.)
No comments:
Post a Comment