వచనము
మఱియు సకల లావణ్యమూర్తి యై వారల కేవురకుఁ బత్నిగాఁ దపంబు సేసిన యక్కన్యక పూర్వదేహంబును జూచి విస్మితుం డయి హర్షించి యున్న ద్రుపదునకు వెండియుం గృష్ణద్వైపాయనుం డి ట్లనియెఁ దొల్లి నితంతుం డను రాజర్షికొడుకు లనంతబలపరాక్రములు సాల్వేయ శూరసేన శ్రుతసేన బిందుసారాతిసారులను వా రేవురుం బరస్పరస్నేహవినయంబుల నతిప్రసిద్ధు లయి పెరుఁగుచు నౌశీనరపతి కన్యక నజిత యను దాని స్వయం వరంబునఁ బడసి వివాహం బయి.
(అంతేకాక ద్రౌపది పూర్వరూపాన్ని చూసి ఆశ్చర్యపడి ఉన్న ద్రుపదుడితో వ్యాసుడు ఇలా అన్నాడు - పూర్వం నితంతుడు అనే రాజర్షి కుమారులు ఐదుమంది ఔశీనరపతి పుత్రిక అజిత అనే ఆమెను వివాహమాడారు.)
No comments:
Post a Comment