వచనము
తొల్లింటి మహాత్ములయందును నిట్టి చరితంబులు గలవుం గావున బాండవుల కేవురకు ద్రౌపదిం గ్రమంబునఁ బాణిగ్రహణంబు సేయింపు మిది మన చేసినయది గాదు దైవాధిష్ఠితం బని ద్రుపదు నొడంబఱచి కుంతియుఁ బాండవులు నున్న చోటికి ద్రుపద సహితుం డయి కృష్ణద్వైపాయనుండు వచ్చి యుధిష్ఠిరున కి ట్లనియె.
(పూర్వం మహాత్ములలో కూడా అటువంటి చరిత్రలు ఉన్నాయి. అందువల్ల ఈ వివాహం జరిపించు. ఇది దైవనిర్ణయం - అని ద్రుపదుడిని ఒప్పించి వ్యాసుడు అతడితో పాండవుల దగ్గరికి వెళ్లి ధర్మరాజుతో ఇలా అన్నాడు.)
No comments:
Post a Comment