వచనము
అక్కట పురోచనుం డొక్కరుండ లక్కయింట దగ్ధుం డయ్యెం గా కేమి దైవానుకూల్యంబు లేక మానుషం బెంతయయ్యు నేమి సేయుఁ బాండవు లేమి దైవసంపన్నులైరో యని వగచి యీ యవసరంబున ద్రుపదు భేదించి పాండవుల నుత్సాదింప వలయు నె ట్లనిన.
(దుర్యోధనుడు చింతించి - ఈ సమయంలో ద్రుపదుడిని వేరుచేసి, పాండవులను పెకలించాలి, ఎలాగంటే.)
No comments:
Post a Comment