వచనము
కావునఁ జతురంగ బల సాధనసన్నద్ధుల మయి యుద్ధంబునం బాంచాలు భంజించి పాండవుల నొండుగడ నుండనీక తోడ్కొనితెత్త మనినఁ గర్ణుపలుకు లాకర్ణించి ధృతరాష్ట్రుం డిది యకార్యం బగు నయినను మతిమంతులతో విచారించి చేయుద మని భీష్మద్రోణవిదురశల్యకృపాశ్వత్థామసోమదత్తాదులం బిలువంబంచి యంతయు నెఱింగించిన భీష్ముండు దుర్యోధనుం జూచి యి ట్లనియె.
(కాబట్టి ద్రుపదుడిని యుద్ధంలో ఓడించి, పాండవులను వెంటతీసుకువద్దాము - అని కర్ణుడు అనగా ధృతరాష్ట్రుడు - ఇది చేయదగని పని. అయినా బుద్ధిమంతులతో ఆలోచించి చేద్దాము - అని పెద్దలను పిలిపించి చెప్పాడు. అప్పుడు భీష్ముడు దుర్యోధనుడితో.)
No comments:
Post a Comment