చంపకమాల
తనరుచు దైవయుక్తి మెయి ధర్మువు సత్యముఁ దప్పకున్న య
య్యనఘుల పైతృకం బయిన యంశము మిన్నక వజ్రపాణి కై
ననుగొనఁబోలునయ్య కురునందన పాండుతనూజు లున్న వా
రని విని వారికిం దగు ప్రియం బొనరింపక యున్కి ధర్మువే.
(పాండవుల తండ్రి భాగాన్ని తీసుకోవటం ఇంద్రుడికి కూడా సాధ్యం కాదు. వారు జీవించే ఉన్నారని విని కూడా వాళ్లకు సంతోషం కలిగించపోవటం ధర్మమా?)
No comments:
Post a Comment