వచనము
మంత్రులు దమ తమ బుద్ధి దోషంబుల నెట్లునుం బలుకుదురు వారల సాధుత్వంబును నసాధుత్వంబును నెఱుంగవలయు నెట్లనినఁ దొల్లి నితంతు వను మగధరాజు వికలేంద్రియవర్గుం డయి శ్వాసమాత్రంబ తక్కి రాజ్యతంత్రంబునం దసమర్థుం డై యున్న నాతనిమంత్రి యేకప్రధానుం డయి రాజ్యతంత్రం బెల్లఁ దనవశంబ యగుటం జేసి వాని నవమానించి తదీయరాజ్యవిభవం బెల్లఁ జేకొనియె వాఁడును విక్రమహీనుం డయి రాజ్యంబు గోల్పడియెం గావున మంత్రులు హితులపోలె నుండి యహితం బాచరింతురు మీయిద్దఱపలుకులు మాకుం జూడ నహితంబు లనిన నలిగి వానికి ద్రోణుం డి ట్లనియె.
(మంత్రులు మనస్సులో కల్మషం ఉంచుకొని ఏదో విధంగా మాట్లాడుతారు. మేలుకోరేవారిలా ఉండి కీడు చేస్తారు. మీ ఇద్దరి మాటలు మాకు కీడు చేసేటటువంటివి - అనగా ద్రోణుడు కోపంతో ఇలా అన్నాడు.)
No comments:
Post a Comment