వచనము
పుణ్యవంతుల నిత్యనైమిత్తికకర్మంబులకు విఘ్నంబులు సేయుచు సింహవ్యాఘ్రగజరూపధరు లై వనంబులం దిరుగుచు మునిపల్లియలు సొచ్చి మునులకుఁ బ్రాణభయంబు సేయు చున్న వారలక్రూరకర్మంబులకు వెఱచి వేల్పులును మునులును బురాణముని యైన బ్రహ్మపాలికిం జని కృతాంజలు లయి జగంబులకు సుందోపసుందులు సేయు నుపద్రవంబులు సెప్పిన విని విశ్వగురుండు విస్మితుం డయి వార లన్యులచేత వధ్యులు గారు గావున పరస్పరయుద్ధంబునఁ బంచత్వంబుఁ బొందవలయునని విచారించి విశ్వకర్మ రావించి రూపలావణ్యవతి యైన యొక్కయువతి సృజియుంపు మని పంచినఁ బ్రసాదం బని మ్రొక్కి యప్పుడు.
(జంతురూపంలో ఆ కర్మలకు విఘ్నాలు, ముని పల్లెలకు ప్రాణభయం కలిగిస్తుండగా వారు బ్రహ్మ దగ్గరకు వెళ్లి ఈ ఉపద్రవాల గురించి చెప్పారు. బ్రహ్మ ఆశ్చర్యపడి, వాళ్లను ఇతరులు చంపలేరు కాబట్టి పరస్పరయుద్ధంలో మరణించాలని ఆలోచించి విశ్వకర్మతో - రూపలావణ్యవతి అయిన యువతిని సృష్టించు - అని ఆజ్ఞాపించగా అతడు బ్రహ్మకు మొక్కి.)
No comments:
Post a Comment