సీసము
అనిన నారదమహామునిపల్కు చేకొని
దమలో నొడంబడి విమలబుద్ధి
నేవురయందును ద్రోవది ప్రీతితో
నొక్కొక్కయింట దా నొక్కయేఁడు
క్రమమున నుండను గమలాక్షి యెవ్వరి
యింటఁ దా నుండె నయ్యింటివలనఁ
బెఱవారు చనకుండ నెఱుఁగక చనిరేని
వెలయఁగఁ బండ్రెండునెలలు తీర్థ
ఆటవెలది
సేవ సేయుచును విశేషవ్రతంబులు
ధీరవృత్తిఁ జలుపువారు గాను
సన్మునీంద్రునొద్ద సమయంబు సేసిరి
రాజనుతులు పాండురాజసుతులు.
(పాండవులు అందుకు ఒప్పుకొని, ద్రౌపది ఒక్కొక్కరి ఇంట ఒక్కొక్క సంవత్సరం ఉండటానికీ, ఆమె ఉన్న ఇంటివైపు ఇతరులు వెళ్లకుండా ఉండటానికీ, ఒకవేళ తెలియక ఎవరైనా వెడితే పన్నెండు నెలలు యాత్రలు, వ్రతాలు చేయటానికీ అంగీకరించి ప్రతిజ్ఞ చేశారు.)
No comments:
Post a Comment