వచనము
మఱి యట్లుంగాక తస్కరవధోపేక్షల నశ్వమేధ భ్రూణహత్యల ఫలం బగు నని వేదంబులయందు వినంబడుఁ దస్కరుల వధియించి బ్రాహ్మణహితంబు చేసినవాఁడవు నీకు సమయోల్లంఘనప్రాయశ్చిత్తంబు సేయ నేల యనిన నర్జునుం డి ట్లనియె.
(దొంగలను చంపటం అశ్వమేధం చేసినంత పుణ్యం, వారిని వదిలిపెట్టటం కడుపులోని బిడ్డను చంపినంత పాపం అని వేదాల వల్ల వింటున్నాము. అందువల్ల నువ్వు ప్రాయశ్చిత్తం చేసుకోవటం ఎందుకు? - అని ధర్మరాజు అనగా అర్జునుడు ఇలా అన్నాడు.)
No comments:
Post a Comment