వచనము
అందును గోదాన భూదాన హిరణ్యదానంబు లాదిగాఁ బెక్కుదానంబులు సేసి యజ్ఞార్థంబుగా భూసురోత్తములకు గోసహస్రంబు లిచ్చి ప్రాగ్దేశంబున కరిగి నైమిశారణ్యంబునందు జగన్నాథునారాయణు నారాధించి యుత్పలినియుఁ గౌశికియు నందయు నపరనందయు గయయు గంగయు గంగాసాగరసంగమంబును జూచుచు.
(అక్కడ దానాలు చేసి, తూర్పుదేశానికి పోయి, జగన్నాథుడిని ఆరాధించి, గంగాసాగరసంగమం మొదలైన ప్రదేశాలను చూస్తూ.)
No comments:
Post a Comment