వచనము
సౌభద్ర పౌలోమ కారంధమ ప్రసన్న భారద్వాజంబు లను నామంబుల దక్షిణసముద్ర తీరంబునం బ్రసిద్ధంబు లయిన యిప్పంచతీర్థంబు లిప్పుడు నూఱేండ్లగోలె నుగ్రగ్రాహగృహీతంబు లయి దుర్జనగృహీతంబు లయిన రాజులవిభవంబులుంబోలె సాధుజనవర్జితంబు లయి యుండు ననిన విని విజయుం డశేషతీర్థసేవార్థి నయి వచ్చిన నాకు నీతీర్థంబు లాడకునికి పౌరుషంబు గా దని యందు.
(వీటిని మొసళ్లు ఆక్రమించాయి - అనగా విని అర్జునుడు - అన్ని తీర్థాలనూ సేవించగోరిన నాకు వీటిలో స్నానం చేయకపోవటం పౌరుషం కాదు - అని.)
No comments:
Post a Comment