సీసము
అట్టిమహాబాహుఁ డత్యంతబలుఁ డెవ్వఁ
డగునొక్కొ యనుచు నే మరుగుదెంచు
వారము త్రైలోక్యవర్తి నంబుజభవ
ప్రభవు నారదుఁ గని భక్తితోడ
మ్రొక్కిన మమ్ము నమ్ముని చూచి యి ట్లేల
వగఁ బొంది కందినవార లనియు
నడిగి మావృత్తాంతమంతయు మాచేత
విని విప్రునలుకయు విధికృతంబుఁ
ఆటవెలది
గ్రమ్మఱింప లావె కావున దక్షిణ
జలధితీరమునఁ బ్రశస్త పంచ
తీర్థములకు నేఁగి ధృతి నందు నూఱేఁడు
లుండుఁ డట్లు మీర లుండు నంత.
(అలా చేయగలవాడు ఎవడా అనుకొంటూ వస్తున్న మాతో నారదుడు - దక్షిణతీరంలోని ఐదు నీటి మడుగుల్లో ఉండండి. అక్కడ మీరు ఉండగా.)
No comments:
Post a Comment