వచనము
అనిన నన్నారదువచనంబులు విని వచ్చి మహోగ్రగ్రాహముల మై భవదాగమనంబు ప్రతీక్షించుచు నిప్పంచతీర్థంబుల నుండి నేఁడు నీకారణంబునం గృతార్థుల మయితి మనిన నర్జునుండును గరుణాయత్తచిత్తుం డయి వంద చెప్పినయన్నలువురకు శాపమోక్షణంబు సేసిన నమరకన్యక లతిహర్షంబున నమరేంద్రనందను దీవించి దేవలోకంబున కరిగి రదిమొదలుగా నిప్పంచతీర్థంబులు నారీతీర్థంబులు నాఁ బరగె నర్జునుండును గ్రమ్మఱి మణిపూరపురంబునకు వచ్చి రాజ్యలీల సుఖంబుండి చిత్రాంగద యందు బభ్రువాహనుండను పుత్త్రుం బడసి చిత్రవాహనునకు వంశకరుంగా నిచ్చి వాని వీడ్కొని గోకర్ణంబుఁ జూచుచుఁ బశ్చిమసముద్రపార్శ్వంబునఁ బ్రభాసం బను తీర్థంబునకుఁ జని యందులకు ద్వారవతి పురంబ కుఱంగలి యని విని.
(అనగా అర్జునుడు మిగిలిన నలుగురికి కూడా శాపవిమోచనం కలిగించాడు. తరువాత మణిపూరపురానికి వచ్చి చిత్రాంగదకు బభ్రువాహనుడనే కుమారుడు పుట్టగా అతడిని వంశకరునిగా ఇచ్చి, అక్కడి నుండి బయలుదేరి గోకర్ణతీర్థాన్ని చూస్తూ, పడమటి సముద్రం పక్కగా ప్రభాసతీర్థానికి వెళ్లి అక్కడికి ద్వారవతి దగ్గర అని విని.)
No comments:
Post a Comment