వచనము
ఇట్లు పరమపురుషు లయిన నరనారాయణులు దమ పూర్వజన్మ సహవాసంబున య ట్లప్పుడు పరమానందంబునఁ బరస్పరప్రియమధురసంభాషణంబుల నొక్కటనుండి యారాత్రి సలిపి రంతఁ బ్రభాతంబ వాసుదేవుండు వాసవనందను నంద యుండం బంచి కాంచనరథారూఢుం డయి పురంబునకుం జని పౌరజనప్రధానసమక్షంబున రైవతకమహోత్సవంబు ఘోషింపం బంచిన.
(వేకువనే కృష్ణుడు అర్జునుడిని అక్కడనే ఉండమని చెప్పి తాను ద్వారకకు వెళ్లి రైవతక మహోత్సవాన్ని చాటించటానికి ఆజ్ఞాపించాడు.)
No comments:
Post a Comment