మత్తేభము
తమకుం దార యజేయు లెవ్వరికి దోర్దర్పంబునన్ దానిపై
శమితారాతి బలుండు వారలకుఁ బాంచాల ప్రభుం డిప్డు సు
ట్టము దానయ్యెఁ దదాత్మజుండయిన ధృష్టద్యుమ్నుడున్ వారితో
సమవీర్యుం డొడఁగూడె నిష్ట సఖుఁ డై సంబంధ బంధంబునన్.
(పాండవులు ఎవరికీ జయింప శక్యం కాని వాళ్లు. మహాబలవంతుడైన పాంచాలరాజు ఇప్పుడు వారికి మిత్రుడు. అతడి కుమారుడైన ధృష్టద్యుమ్నుడు పాండవులతో సమానమైన పరాక్రమం కలవాడు.)
No comments:
Post a Comment