వచనము
వారల బలపరాక్రమంబు లెల్లవారికి దృష్టపూర్వంబుల యట్టివారితోడ విగ్రహంబు సేయు దుర్బుద్ధులుం గలరె నీపుణ్యమ్మున నమ్మహాత్ములు జననీసహితంబు లక్కయింట బ్రతికిరి నీయందుఁ బురోచనదిగ్ధం బయిన దుర్యశఃపంకంబుఁ బాండవానుగ్రహజలంబులం జేసి కడిగికొనుము దుర్యోధనాపరాధంబున నఖిలమహీప్రజకు నపాయం బగు నని తొల్లియు నీకుం జెప్పితి నట్లు గాకుండ రక్షింపు మనిన విని ధృతరాష్ట్రుండు విదురున కి ట్లనియె.
(వారితో యుద్ధం చేసే దుర్బుద్ధులు ఉన్నారా? నీ పుణ్యం వల్ల వారు లక్కయింట్లో తల్లితో కూడా బ్రతికారు. పురోచనుడి వల్ల నీకు అంటిన అపకీర్తిని పాండవుల పట్ల దయ చూపి తొలగించుకో. దుర్యోధనుడి తప్పు వల్ల లోకానికి అపాయం కలుగుతుందని నీకు ముందే చెప్పాను. అలా కాకుండా రక్షించు - అనగా ధృతరాష్ట్రుడు విదురుడితో ఇలా అన్నాడు.)
No comments:
Post a Comment