సీసము
వారిదారుణతపోవహ్నిదాహంబున
వింధ్యాద్రిదరుల నావిర్భవించి
యత్యుచ్చ మయి ధూమ మాకాశమెల్లను
గప్పిన నమరులు గరము వెఱచి
రత్నంబులను వధూరత్నంబులను జేసి
తత్తపోవిఘ్నవిధాననిరతు
లయి ప్రబోధింపంగ నలవిగాకున్నఁ దో
యజుగర్భుపాలికి నరిగి యసుర
ఆటవెలది
వరులతపముఁ జెఱువవలయు నావుడుఁ గమ
లాసనుండు త్రిభువనార్చితుండు
సురహరితంబుపొంటె సుందోపసుందుల
కడకు వచ్చె వరము కరుణ నీఁగ.
(వారి తపస్సుకు విఘ్నం కలిగించే ప్రయత్నాలు విఫలమై దేవతలు బ్రహ్మను ప్రార్థించగా, అతడు వారికి మేలు చేయాలని సుందోపసుందుల దగ్గరకు వచ్చాడు.)
No comments:
Post a Comment