వచనము
నా వచనం బమోఘం బనిన శమీకుండు శోకాకులితచిత్తుండై తన శిష్యున్
గౌరముఖుం డనువానిం బిలిచి దీని నంతయుఁ బరీక్షితున కెఱింగించి తక్షకువలని
భయంబు దలంగునట్టి యుపాయంబు సేసికొమ్మని చెప్పి రమ్మనిన వాఁడు నప్పుడ
పరీక్షితు పాలికిం జని యిట్లనియె.
(నా మాట వ్యర్థం కాదు అని శృంగి చెప్పగా, శమీకుడు బాధపడి, తన శిష్యులను పిలిచి, తక్షకుడి వల్ల కలగబోయే ఆపద గురించి పరీక్షిత్తుకు చెప్పమని పంపగా గౌరముఖుడనే శిష్యుడు పరీక్షిత్తు దగ్గరకు వెళ్లి.)
No comments:
Post a Comment