సీసము
అడవిలో నేకాంతమతి ఘోరతపమున
నున్న మాగురులపై నురగశవము
వైచుట విని యల్గి వారితనూజుండు
శృంగి యన్వాఁడు కార్చిచ్చునట్టి
శాపంబు నీకిచ్చె సప్తాహములలోన
నాపరీక్షితుఁడు నాయలుకఁ జేసి
తక్షకవిషమున దగ్ధుఁ డయ్యెడ మని
దానికి గురులు సంతాప మంది
ఆటవెలది
భూతలేశ నన్నుఁ బుత్తెంచి రిప్పుడు
తద్భయంబు లెల్లఁ దలఁగునట్టి
మంత్రతంత్రవిధు లమర్చి యేమఱకుండు
నది నిరంతరంబు ననియుఁ గఱప.
(శృంగి శాపం గురించి చెప్పాడు.)
No comments:
Post a Comment