చంపకమాల
పరమగురూపదేశమునఁ బార్థుఁడు పార్థివవంశశేఖరుం
డరిది తపంబునన్ భుజబలాతిశయంబున నీశుఁ బన్నగా
భరణుఁ బ్రసన్నుఁ జేసి దయఁ బాశుపతాదిక దివ్యబాణముల్
హరసురరాజదేవనివహంబులచేఁ బడసెం బ్రియంబునన్.
(గురూపదేశం ప్రకారం అర్జునుడు తపస్సుచేసి, శంకరుడి చేత, ఇంద్రుడి చేత పాశుపతం మొదలైన దివ్యాస్త్రాలు పొందాడు.)
No comments:
Post a Comment